కోస్గి మండలంలో 86.7 శాతం పోలింగ్ నమోదు

కోస్గి మండలంలో 86.7 శాతం పోలింగ్ నమోదు

NRPT: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 86.7% పోలింగ్ నమోదైనట్టు అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మండల వ్యాప్తంగా మొత్తంగా 8190 మంది పురుషులు, 8614 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఉదయం 9 గంటలకు 14.44%, 11 గంటల సమయానికి 58.85% పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.