డ్రగ్స్, ర్యాగింగ్కు దూరంగా ఉండాలి: ఎస్సై
NTR: విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో గురువారం విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాచవరం ఎస్సై శ్రీనివాస్ డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు, సమాజానికి కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. సరదాగా ప్రారంభించిన అలవాట్లు వ్యసనంగా మారి భవిష్యత్తును నాశనం చేస్తాయని ఎస్సై హెచ్చరించారు.