VIDEO: రోడ్ల అభివృద్ధి కోసం కేంద్ర మంత్రికి విజ్ఞప్తి

KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లారు. కర్నూలు నుంచి కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల మీదుగా బళ్లారి వరకు 102 కిలో మీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్డు అభివృద్ధి చేయాలని, గుత్తి-పత్తికొండ రోడ్డును 71 కిలో మీటర్ల మేర అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.