సూర్యలంక అభివృద్ధి పనుల పరిశీలన
బాపట్ల: ఎంపీ కృష్ణప్రసాద్ సూర్యలంకలో పర్యటించారు. అధికారులతో కలిసి మంగళవారం అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.97.52 కోట్లతో సూర్యలంక తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణాల్లో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. పర్యాటకులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు.