MLAని అభినందిస్తున్న పటాన్చెరు మేధావుల బృందాలు
SRD: పటాన్చెరు CSR నిధుల దారిమళ్లింపుపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల గోల్మాల్పై 'హిట్ టీవీ' వరుస కథనాలు, మేధావుల ఫోరం ఆరోపణలతో స్పందించిన ఆయన బుధవారం కలెక్టర్ను కలిశారు. "కాలుష్యం మాకు.. నిధులు పక్క నియోజకవర్గాలకా?" అని నిలదీస్తూ, స్థానిక నిధులను ఇక్కడి అభివృద్ధికి మాత్రమే వాడాలని డిమాండ్ చేశారు.