పాక్ సెనెటర్ ప్రేలాపనలు
భారత్పై పాక్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. భారత్-యూఏఈ సంబంధాలపై పాక్ సెనెటర్ ముషాబిద్ హుస్సేన్ మాట్లాడుతూ. యూఏఈ కూడా మరో భారత్లా మారకుండా జాగ్రత్తపడాలంటూ ప్రేలాపనలు చేశారు. యూఏఈ చాలా చిన్న దేశమని.. అక్కడ భారతీయులు అత్యధికంగా ఉన్నందున అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వ్యాఖ్యానించారు. యూఏఈ అభివృద్ధిలో పాక్ పాత్ర చాలా ఉందంటూ పేర్కొన్నారు.