చంద్రబాబు, లోకేష్లపై లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు
AP: చంద్రబాబు, లోకేష్లపై YCP నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు చేశారు. వారి రాజకీయాలన్నీ మోసాలేనని, కుటుంబ చరిత్ర తెలుసుకోవాలని మండిపడ్డారు. జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని, దీనిపై కూటమి నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. మంచి నాయకుడంటే జగన్లా ఉండాలని, కూటమి రాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.