అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్
WGL: కలెక్టర్ డా. సత్య శారద బుధవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమర్థవంతంగా అమలు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.