సొసైటీ ఉన్న.. అమ్మకాలు సున్నా!

MDK: రైతులు యూరియా కొరతతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్సింగి మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో 1300 మంది సభ్యులు ఉన్న యూరియా అమ్మకాలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. రెండేళ్ల నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాలపై చూపిస్తున్న ప్రేమ రైతులకు యూరియా పంపిణీ చేయడంపై చూపించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.