BREAKING: లొంగిపోయిన LeT ఉగ్రవాదులు

J&Kలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు లొంగిపోయారు. ఇర్ఫాన్ బషీర్, ఉజైర్ సలామ్ అనే ఉగ్రవాదులు లొంగిపోయారని భద్రతా బలగాలు ప్రకటించాయి. వారి నుంచి 2 ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 102 రౌండ్స్, 2 హ్యాండ్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు లొంగిపోయినట్లు సమాచారం.