భక్తిశ్రద్ధలతో 'హనుమాన్ చాలీసా' పారాయణం

భక్తిశ్రద్ధలతో 'హనుమాన్ చాలీసా' పారాయణం

E.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెం గీత మందిరం వద్ద 54వ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా జరిగింది. శ్రీ రామదూత భక్త బృందం ఆధ్వర్యంలో 53 మంది దంపతులు సామూహికంగా చాలీసా పఠించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. దెందులూరు సీతారామ శర్మ హనుమంతుని వైభవంపై ప్రవచనాలు చేయగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.