'ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి'
BHNG: ప్రభుత్వ పథకాల అమలు సమర్థంగా జరగాలని జడ్పీ సీఈవో శోభారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం బీబీనగర్ మండలం గూడూరులో ఆమె ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని నర్సరీతో పాటు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని పరిశీలించారు. ఆరోగ్య ఉప కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.