పీఏబీఆర్ జలాశయం నుంచి నీటి విడుదల నిలిపివేత
ATP: పీఏబీఆర్ జలాశయం అధికారులు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం జలాశయంలో 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వఉంది. ఎంపీఆర్కు 150, జల విద్యుదుత్పత్తికి 110 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. జలాశయానికి 220 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 340 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉంది.