మార్కెట్ కమిటీ ఛైర్మన్పై కత్తులతో దాడి..
SRCL: స్థానిక సంస్థల ఎన్నికల వేళ వేములవాడలో దారుణం చోటుచేసుకుంది. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రోండి రాజుపై దుండగులు దాడి చేశారు. ఇంటి దగ్గర కారు పార్కింగ్ చేస్తుండగా కత్తులతో దాడికి పాల్పడ్డాడు. రోండి రాజుకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక MLA ఆది శ్రీనివాస్ హాస్పిటల్కు వెళ్లి రాజును పరామర్శించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.