నేడు ఢిల్లీలో పర్యటించనున్న నారా లోకేష్
AP: ఢిల్లీలో ఇవాళ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించనున్నారు. ఈ మేరకు రాజధానితో పాటు ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి కావలసిన నిధులు మంజూరు చేయమని కోరనున్నారు.