ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..!
NZB: వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏఎంసీ ఛైర్మన్ సురేష్ బాబా ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హుమ్నాపూర్ గ్రామ సర్పంచ్ అప్పి రెడ్డి, సొసైటీ మాజీ ఛైర్మన్ కనక రెడ్డి, ఘన్ పూర్ సర్పంచ్ ముత్తకుంట కృష్ణ, రైతులు పాల్గొన్నారు.