సింహాద్రి అప్పన్నకు స్వర్ణపుష్పార్చన
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఇవాళ అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండువగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై స్వామిని అధిష్ఠించి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల మధ్య స్వర్ణపుష్పార్చన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు.