ALERT: రాష్ట్రంలో భారీ వర్షాలు

ALERT: రాష్ట్రంలో భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూ.గో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. నాలుగు రోజులపాటు కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని, 40-60కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది.