విద్యార్థులకు రేబిస్ వ్యాధిపై అవగాహన
BHNG: రాజాపేట మండలంలోని నేమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల పశు వైద్యాధికారి చంద్రారెడ్డి విద్యార్థులకు రేబిస్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుక్క కాటు వేస్తే రేబిస్ వ్యాధి రాకుండా పెంపుడు జంతువులకు రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు ప్రతి సంవత్సరం తప్పకుండా ఇప్పించాలన్నారు.