ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
VZM: రామభద్రపురం చిన్నమ్మతల్లి గుడి వద్ద శనివారం పార్వతీపురం నుంచి రామభద్రపురం వస్తున్న RTC బస్సును బొబ్బిలి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టిన ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికుడు అప్పారావు తీవ్రంగా గాయపడ్డారు. కురుపాం పెళ్లిచూపులకు సోదరిడితో వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్దానిక ASI అప్పారావు చెప్పారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రకి తరలించామన్నారు.