గిద్దలూరులోని లాడ్జీలో తప్పిన పెను ప్రమాదం
గిద్దలూరు పట్టణంలోని ఎస్ఎస్ ప్లాజా డీలక్స్ లాడ్జిలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లాడ్జి రెండో అంతస్తులోని ఏసీ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.