ఓటు హక్కు వినియోగించుకున్న CM
బీహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో CM నితీశ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బఖ్తియార్పూర్లో ఓటు వేసిన ఆయన ప్రజలు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అటు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా లఖీసరాయ్ జిల్లాలో ఓటు వేశారు. కాగా 121 స్థానాల్లో జరుగుతున్న ఈ విడతలో ఉదయం 11 గంటల సమయానికి 27.65 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.