రైలు కిందపడి బీటెక్ విద్యార్థి మృతి

రైలు కిందపడి బీటెక్ విద్యార్థి మృతి

కడప-కనుమలో పల్లె మధ్య గిరిజ భవన్ వెనుక శుక్రవారం సాయంత్రం రైలు కిందపడి బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతుడు కడప నగరంలోని ప్రకాశ్ నగర్ కాలనీకి చెందిన చింతకుంట సురేష్‌గా గుర్తించారు. మృతుడు నగరంలోని KSRM ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు SI తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.