పోలీస్ పహారాలో ప్రశాంతంగా ఓటింగ్
సూర్యాపేట జిల్లా లింగంపల్లి గ్రామంలో భారీ బందోబస్త్ నడుమ పోలింగ్ జరుగుతోంది. నిన్న BRS కార్యకర్త మల్లయ్య హత్య జరిగిన విషయం తెలిసిందే. కాగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. పోలీసులు పహారాలోనే గ్రామస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.