తడసిన పంటలను పరిశీలించిన సీపీఐ బృందం
ELR: వేలేరుపాడు మండలంలో తడిసిన మిర్చి మొక్కజొన్న, వేరుశనగ, పుల్ల శనగ, కంది తదితర పంటలను సీపీఐ మండల బృందం శనివారం పరిశీలించింది. అకాల వర్షం కారణంగా తడిసిన పంటలను ప్రభుత్వం మద్దతు దరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.50 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి రైతులని ఆదుకోవాలని మండల కార్యదర్శి బాడిశ రాము కోరారు.