శర్వానంద్ మూవీలో యంగ్ బ్యూటీ!
టాలీవుడ్ హీరో శర్వానంద్తో దర్శకుడు శ్రీను వైట్ల సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో '8 వసంతాలు' ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.