VIDEO: ఖమ్మంలో పెరిగిన ఏసీ మిర్చి ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,350, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ. 8,000, కొత్త మిర్చి రూ. 16,119 పత్తి ధర రూ. 7,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి రూ. 50 పెరగగా.. కొత్త మిర్చి ధర రూ. 410 తగ్గగా.. అటు నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలు స్థిరంగా ఉన్నాయి.