2027 వన్డే ప్రపంచకప్.. గంభీర్ కీలక వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్ 2026ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ దృష్టంతా 2027 వన్డే ప్రపంచకప్ మీదే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. IPL 2026 ముగిసిన తర్వాత వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలు ప్రారంభమవుతాయని తెలిపాడు. అప్పుడే బ్లూ ప్రింట్ సిద్ధం అవుతుందని వెల్లడించాడు. ఎంత త్వరగా సన్నాహకాలు ప్రారంభిస్తే అంత మంచిదని చెప్పుకొచ్చాడు.