ఛైర్ పర్సన్‌గా నాగలక్ష్మి పదవి బాధ్యతల స్వీకరణ

ఛైర్ పర్సన్‌గా నాగలక్ష్మి పదవి బాధ్యతల స్వీకరణ

JGL: ధర్మపురి మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్‌గా వేముల నాగలక్ష్మి పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రజల సహకారంతో పారదర్శక పాలన అందిస్తానని ఛైర్ పర్సన్‌ హామీ ఇచ్చారు.