నేడు కరకగూడెంలో ఎమ్మెల్యే పర్యటన
BDK: కరకగూడెం మండలంలో నేడు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ప్రకటించారు. ముందుగా ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలిపారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గంతో సమావేశం నిర్వహిస్తారని అన్నారు. కావున ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.