వలసబాట పట్టిన పల్లె ప్రజలు

వలసబాట పట్టిన పల్లె ప్రజలు

KRNL: బతుకుతెరువుకోసం కూలీలు వలసబాట పట్టారు. నందవరం నాగలదిన్నె గ్రామానికి చెందిన 50 మంది ఆదివారం రాత్రి రెండు బొలేరో వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించక గుంటూరు మిర్చి కోతలకు వలసలు వెళ్తున్నామన్నారు. గత మూడు రోజుల్లో ఆరు వాహనాల్లో 200 మంది వలసల వెళ్లారని గ్రామస్తులు తెలిపారు.