'కార్మికుల సమస్యలను సర్కార్ పరిష్కరించడం లేదు'
భూపాలపల్లిలోని సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ.. కార్మికులను మభ్యపెట్టి కోల్ బెల్ట్ ఏరియాలో అత్యధిక MLA స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని మండిపడ్డారు.