గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
ప్రకాశం: కనిగిరి మండలం పేరంగుడిపల్లి రోడ్డులో నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల భవన పనులను కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శనివారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులతో సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోపు నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.