జిల్లా సైక్లింగ్ అంబాసిడర్గా పిట్టలి అజయ్
ASR: అరకు చలి ఉత్సవ్లో భాగంగా బొర్రా గుహలు నుంచి అరకు ఐటీఐ వరకూ 36 కిలోమీటర్లు నిర్వహించిన సైక్లింగ్ పోటీల్లో అరకు మండలం దొండపాడు గ్రామానికి చెందిన పిట్టలి అజయ్(13) గిరిజన బిడ్డ ద్వితీయ స్థానం సాధించాడు. అజయ్ను జిల్లా సైక్లింగ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అజయ్ తండ్రి లైభన్ను అభినందించారు.