కాంట్రాక్టర్పై PSలో ఫిర్యాదు
MNCL: భీమారం మండలంలో పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన కాంట్రాక్టర్ రామారావుపై చర్యలు తీసుకోవాలని మండల జర్నలిస్ట్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం SI శ్వేతకు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. దంపూర్ రోడ్డును పరిశీలించిన జర్నలిస్ట్ను దూషించి, జర్నలిస్ట్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.