'బాల కార్మికుల నిర్మూలన కాగితాలకే పరిమితం'
MDK: బాల కార్మికుల నిర్మూలన కేవలం కాగితాలకే పరిమితమైంది. చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో వారు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. చిన్నశంకరంపేట మండలం కామారం శివారులోని ఎస్జీ స్నాక్స్ పరిశ్రమ వద్ద బిహార్ నుంచి వలస వచ్చిన కార్మికుల పిల్లలు కనీస ఆధారం లేక మట్టిలో మగ్గుతున్నారు.