కాలవలో రాళ్లు.. మురుగునీరుతో ప్రజల అవస్థలు

కాలవలో రాళ్లు.. మురుగునీరుతో ప్రజల అవస్థలు

BDK: మణుగూరు మున్సిపాలిటీ భగత్ సింగ్ నగర్‌లో సైడ్ డ్రైనేజ్ కాలవలో రాళ్లు అడ్డంగా ఉండడంతో మురుగు నీరుపోక చుట్టుపక్కల ప్రజలు దోమలు, మురుగు వాసనతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులకు పన్నుల మీద ఉన్న దృష్టి ప్రజల పనుల మీద లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కారించాలని వారు డిమాండ్ చేశారు.