మానేరు వంతెనపై రైతుల ధర్నా
SRCL: తంగళ్ళపల్లి మానేరు వంతెనపై బీజేపీ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమునేని శ్రీధర్ రావు మాట్లాడుతూ.. కాలేశ్వరం 11వ ప్యాకేజీ పనులు వెంటనే పూర్తి చేసి మండలంలోని రైతులకు నీళ్లు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. అధికారం రాకముందు అన్ని హామీలు ఇచ్చి ఇప్పుడు మండలంలోని రైతులను పట్టించుకోవడంలేదన్నారు.