ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం
AKP: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు దేవప్రసాద్, మోహన్ రావు పటేల్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దేశ సమగ్రత, ఐక్యత, భద్రతను కాపాడడానికి కృషి చేస్తామని పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు.