ఈనెల 26 లోపు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO
KMM: పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. థియరీకి టెన్త్కు రూ. 100, ఇంటర్కు రూ.150 ఫీజుగా నిర్ణయించారు. తత్కాల్ స్కీంలో అదనంగా టెన్త్కు రూ. 500, ఇంటర్ కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.