పాక్‌పై మోదీ సంచలన వ్యాఖ్యలు

పాక్‌పై మోదీ సంచలన వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడి అని ప్రధాని మోదీ అన్నారు. ఈ దాడిలో మన తల్లుల సింధూరాన్ని దూరం చేసిన వారికి ఆపరేషన్ సింధూర్‌తో ధీటైన సమాధానం చెప్పామని పేర్కొన్నారు. ఉగ్రవాదులు మనల్ని విభజించాలని చూశారని.. కానీ దేశమంతా ఐక్యతతో నిలిచి వారికి గట్టి బుద్ధి చెప్పారని కొనియాడారు. పాక్ సైతం మతం పేరుతో మనల్ని విభజించాలని ప్రయత్నించిందని ఆరోపించారు.