వల్లభనేని వంశీకి మరో షాక్

వల్లభనేని వంశీకి మరో షాక్

AP: వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. 2019లో గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బాపులపాడు మండలంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి వంశీ నకిలీ పట్టాలు ఇచ్చారనే అభియోగంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ని కస్టడీకి కోరుతూ పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ నెల 19లోగా నూజివీడు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.