అక్రమంగా పశువుల తరలింపు ఇద్దరి అరెస్ట్
SKLM: కంచిలి నుంచి విశాఖపట్నానికి ఆరు పశువులను వ్యానులో తరలిస్తుండగా పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు సీఐ రామకృష్ణ నిన్న తెలిపారు. పశువుల అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. పశువులు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.