VIDEO: వనిత టీ స్టాల్ ప్రారంభించిన ఎంపీ

JN: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గురువారం వనిత టీ స్టాల్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనిత టీ స్టాల్ను చక్కగా నడుపుకొని అభివృద్ధిలోకి రావాలని కడియం శ్రీహరి ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.