'డ్రోన్ ప్రదర్శనపై డెమో చేయండి'

కర్నూలు: ట్రిపుల్ ఐటీడీఎం విద్యా సంస్థ ఆధ్వర్యంలో రూపొందుతున్న డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ తుది దశకు చేరుకుంది. గురువారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో ఈ వ్యవస్థకు సంబంధించిన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పరిశీలించారు. ఒక గ్రామాన్ని ఎంపిక చేసి డెమో నిర్వహించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు.