బోండీబీచ్ ఘటన.. ఐసిస్తో సంబంధాలు
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్లో యూదులపై దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులైన తండ్రీకొడుకులు నవీద్ అక్రమ్ (24), సాజిద్ అక్రమ్ (50)లకు ఉగ్రవాద సంస్థ ISISతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల కారులో రెండు ఐసిస్ జెండాలు, ఘటనా స్థలం నుంచి రెండు ఐఈడీలు స్వాధీనం చేసుకున్నామన్నారు.