రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషీయాన్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషీయాన్  మృతి

PDPL: ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ పంచాయతీ కార్యాలయం ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి మండలానికి చెందిన పెద్దెల్లి సుధీర్ (50) మృతి చెందాడు. స్థానిక వివరాల ప్రకారం.. గర్రెపల్లి గురుకులంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న సుధీర్ బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.