పెద్దపులి కలకలం.. భయాందోళనలో ప్రజలు
AP: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం తాడువాయిలో పెద్దపులి కలకలం రేపింది. మేత మేస్తున్న గేదె దూడపై అకస్మాత్తుగా పులి దాడి చేసింది. గ్రామానికి సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.