నేడు ఆశీల వేలంపాట
SKLM: ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఆశీల వసూలు కోసం బహిరంగ వేలం పాట నిర్వహించ నున్నట్లు మున్సిపల్ కమిషనర్ టి.రవి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోనూ, మార్కెట్లోనూ రోజువారి ఆశీలు, కబేళా ఆశీల వసూలు కోసం వేలం పాట ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ వేలంపాటలో తగిన పత్రాలు సమర్పించి పాల్గొనాలన్నారు.