ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం
SDPT: హుస్నాబాద్ పట్టణంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం భాగంగా మల్లె చెట్టు చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.